
Best Web Hosting Provider In India 2024

South West Monsoon : నైరుతి రుతుపవనాల గమనంపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకినట్లు ప్రకటించింది. రుతుపవనాలు ప్రస్తుతానికి మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
సంబంధిత కథనం
టాపిక్
MonsoonAp RainsTs RainsWeather