Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: దళితుల కోసం హృదయంతో ఆలోచించే నేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్రావు కొనియాడారు. ఎవరూ అడగకుండానే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ను మరో పదేళ్ల పాటు కొనసాగిస్తూ అర్డినెన్స్ చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను పొడిగించడం శుభపరిణామమన్నారు. సబ్ప్లాన్పై ఈనాడు పొట్ట రాక్షసుడు అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీరావుకు లేదని ధ్వజమెత్తారు. ఎస్సీ సబ్ప్లాన్పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలి స్థానం వచ్చిందని గుర్తు చేశారు. సోమవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్రావు మీడియాతో మాట్లాడారు.