Best Web Hosting Provider In India 2024

అనంతపురం: 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహసారథుల (జేసీఎస్) మండల కన్వీనర్లతో రీజినల్ కోఆర్డినేటర్ చల్లా మధుసుదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారులు అలూరు సాంబ శివారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ చైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు.