Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాతలు రాస్తే బాగుంటుందని, సబ్ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించినప్పుడు రామోజీరావు ఎక్కడున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. రామోజీరావుకు ఇప్పుడే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గుర్తొచ్చిందా..? అని ప్రశ్నించారు. సబ్ప్లాన్పై రామోజీ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినప్పుడు ఈ కన్నీటి వెతలు, రాతలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అవన్నీ కడుపులో దాచుకుని, ఇవాళ చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం విషపు రాతలు రాస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు సబ్ ప్లాన్ ఇవాళ గుర్తొచ్చిందా..? అని నిలదీశారు. రాష్ట్రంలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల కోసం శాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. సీఎం వైయస్ జగన్ దళిత పక్షపాతిగా నిలిచారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.