Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుబాష్ చంద్రబోస్, ఎన్.రెడ్డప్ప తెలిపారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. న్యూఢిల్లీలో వైయస్ఆర్సీపీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుబాష్ చంద్రబోస్, ఎన్.రెడ్డప్ప లు మీడియాతో మాట్లాడారు.