Best Web Hosting Provider In India 2024

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే కోటంరెడ్డి తనకు అండగా నిలిచిన పార్టీకే ద్రోహం చేశాడు. అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాపును చూసి బలమనుకుని భ్రమపడుతున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పింది అబద్దమని శివారెడ్డి చెబుతున్నారు. శ్రీధర్రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్ ఆరోపణలు నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.