Best Web Hosting Provider In India 2024

జగ్గంపేట: చంద్రబాబు రెండెకరాల నుంచి రూ.20 లక్షల కోట్ల ఆస్తులకు ఎలా ఎదిగారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రశ్నించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని పార్టీ పెట్టిన ఎన్టీఆర్ను, పాత తెలుగుదేశం పార్టీని మింగేసిన అనకొండ చంద్రబాబు అని ఫైరయ్యారు. ఆస్తులపై చర్చకు చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధమా అని సవాలు విసిరారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు సరికాదన్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.