Best Web Hosting Provider In India 2024

రాయచోటి: అచ్చోసిన అంబోతుల్లా తండ్రీకొడుకులు బూతులు మాట్లాడుతున్నారని, రాష్ట్రంపై చంద్రబాబు, లోకేష్ కోపంతో రగిలిపోతున్నారని అన్నమయ్య జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా నారా లోకేష్కు లేదన్నారు. వైయస్ జగన్ జమ్మలమడుగు క్యాంపు బెల్ ఆస్పత్రిలో పుట్టారని చెప్పారు. ముందు నువ్వెక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో లోకేష్ తెలుసుకోవాలన్నారు. బూతులే రాజకీయం అనుకుంటే లోకేష్ కంటే ఎక్కువ మాట్లాడగలమని, కానీ, మా నాయకుడు వైయస్ జగన్ మాకు సంస్కారవంతమైన రాజకీయాలు నేర్పారని చెప్పారు. వైయస్ఆర్ జిల్లాలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో గడికోట శ్రీకాంత్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.