Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్రానికి పట్టిన అసలైన శనిగాడివి, దరిద్రానివి నువ్వే చంద్రబాబూ అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. నీ ఇనుప పాదం రాష్ట్రంలో లేకపోవడం వలనే పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దయచేసి ఆంధ్రాలో ఇల్లు కట్టుకుని జనాన్ని రోడ్డు పాలు చేయొద్దు.. నీ శేష జీవితం హైదరాబాద్ లోనే ముగించు అంటూ సలహా ఇచ్చారు. శుక్రవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా?. సీఎం వైయస్ జగన్ డీఎన్ఏ రాయలసీమది.. నీ డీఎన్ఏ ఏంటి? లోకేష్ ఎక్కడ పుట్టాడని మేం అంటే ఎలా ఉంటుంది?. లోకేష్ డీఎన్ఏ తెలంగాణదిని కొడాలి నాని పేర్కొన్నారు.
చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు. ఒక ఎజెండా లేకుండా లోకేష్ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా? అని నిలదీశారు.