Best Web Hosting Provider In India 2024

తుని: చంద్రబాబు నాయుడు అనే దరిద్రుడికి ఒక వెహికిల్ కేటాయించి దాంట్లో నలుగురు మానసిక వైద్యులను ఆయన వెంట పంపించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి వైయస్ జగన్ను విజ్ఞప్తి చేశారు. పిచ్చి ముదిరి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, ప్రజలను పక్కదోవపట్టించేలా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుంటే కరువు రక్కసికి తాత వచ్చి జిల్లాలో తిరుగుతున్నాడని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు.