Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: ఇంట్లో మహిళల జోలికి వస్తే చెప్పులతో కొడతారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. చంద్రబాబు అండ్ కో వెంటనే భాష మార్చుకోవాలని, రాజకీయాల్లో లేని మహిళల గురించి మాట్లాడొద్దని ఆమె హితవు పలికారు. విశాఖలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.
*ఆమె కాలి గోటికి కూడా సరిపోరు:*
సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మూడున్నర ఏళ్లలోనే, ఎన్నికల హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేయడంతో చంద్రబాబు అండ్ కో కు దిక్కు తోచడం లేదు. అందుకే ఇంట్లో ఉన్న ఆడవారిని విమర్శిస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు.
అలా పిచ్చి విమర్శలు చేస్తున్న వారు నిజానికి శ్రీమతి వైయస్ భారతి కాలిగోటికి కూడా సరిపోరు. ప్రభుత్వ పాలన, పార్టీ సిద్దాంతాల మీద మాట్లాడితే సమాధానం చెబుతామని స్పష్టం చేశాం. అయినా వాటి గురించి మాట్లాడకుండా పదే పదే ఇంట్లో ఉన్న ఆడవారిని బయటకు లాగుతున్నారు.