CBN Anakapalli tour: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన, పోలవరం ఎడమకాల్వ పరిశీలన, మెడ్‌టెక్‌ జోన్ ప్రారంభోత్సవం

Best Web Hosting Provider In India 2024

CBN Anakapalli tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన జరుగుతోంది. పోలవరం ఎడమ కాల్వ పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన సీఎం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 2014-19 మధ్య పట్టిసీమ తరహాలోనే ఎడమ కాల్వకు కూడా నీటిని తరలించాలని చంద్రబాబు ప్రయత్నించారు. సాంకేతిక అవరోధాలతో పాటు భూసేకరణ సమస్యలతో పనులు పూర్తి కాలేదు.

ప్రస్తుతం పోలవరం ఎడమ కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్థానికుల అవసరాలతో పాటు విశాఖపట్నంకు తాగునీటి తరలింపు ప్రాధాన్యత నేపథ్యంలో ఎడమ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన తర్వాత చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ఆ తర్వాత వర్చువల్‌గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మెడ్ టెక్ జోన్ ‌లో కొత్తగా నిర్మించిన భవనాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. మెడ్‌టెక్ జోన్ కార్మికులతో సమావేశం అవుతారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు.

WhatsApp channel

టాపిక్

TdpChandrababu NaiduUttarandhraGovernment Of Andhra PradeshPolavaram Project
Source / Credits

Best Web Hosting Provider In India 2024