Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: బలహీనవర్గాల ప్రజలు తల ఎత్తుకొని జీవించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం వైయస్ జగన్ నిరూపించారన్నారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ బద్దలుకొట్టారన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.