Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: బీసీలంతా చంద్రబాబును నిలదీయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలొస్తే.. బాబు కౌంటర్ పెట్టి అమ్మేవాడన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలవారు పాలకులుగా మారితే .. సమ సమాజం సాకారం అవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్నట్టుగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు అడుగడుగునా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. అంబేడ్కర్ గారి కలలను నిజం చేస్తున్నారు.