Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే టీడీపీ గన్నవరం డ్రామాకు తెర లేపిందని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గన్నవరం గొడవ ప్రపంచ స్థాయి విషయం అన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిని అరెస్టు చేస్తే.. రాధాకృష్ణ, రామోజీలకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు ఏమో..అన్నారు. మేం నిజంగా కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా..? అని ప్రశ్నించారు. మేం చేసిన సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళ్లకూడదని చంద్రబాబు విజయవాడలో గొడవలు సృష్టించాడు, పట్టాభిని ఎవరైనా కిడ్నాప్ చేయగలరా..? ఆయన్నెవరైన ఎత్తుకుని వెళ్లగలరా..?
చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోండి అని సూచించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు..