Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు వైయస్ఆర్ లా నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి యువ లాయర్ల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో ఏడాది రాష్ట్రంలోని 2,011 మంది అర్హులైన జూనియర్ లాయర్ల బ్యాంక్ ఖాతాల్లో కోటి 55 వేల రూపాయలను సీఎం జమ చేయనున్నారు. నేడు విడుదల చేస్తున్న నిధులతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు 35.40 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.