MLA Arikepudi Gandhi : ఆపరేషన్ ఆకర్ష్…! కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

Best Web Hosting Provider In India 2024

బీఆర్ఎస్ పార్టీని మరో ఎమ్మెల్యే వీడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. గాంధీ చేరికతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

 శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికెపూడి గాంధీ 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన గాంధీ… 2018కి ముందు బీఆర్ఎస్ లో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విప్ గా కూడా ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశించినప్పటికీ దక్కలేదు. 

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య హస్తం, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి గూటికి, ప్రకాశ్ గౌడ్ చేరారు. తాజాగా గాధీ చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరో నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని తెలుస్తోంది.

 

WhatsApp channel

టాపిక్

BrsCongress CampaignCm Revanth ReddyTs Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024