ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి..

Best Web Hosting Provider In India 2024

కర్నూలు: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తోందని, వారికి అనుకూలమైన వ్యక్తి చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మండిపడ్డారు. ఈనాడు తప్పుడు కథనాలపై వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఫైరయ్యారు. కలెక్టరేట్‌ వద్ద ఈనాడు పత్రికను దగ్ధం చేశారు. అనంతరం కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, మేయర్‌ బీ.వై.రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఘటనకు సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఈనాడు పత్రిక తప్పుడు వార్తను ప్రచురించిందని మండిపడ్డారు. పత్రికా విలువలను తుంగలో తొక్కే విధంగా ఎల్లో మీడియా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందన్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలను రాయాలన్నారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *