Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కు బిషప్లు, రెవరెండ్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను తీసుకొచ్చారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.