Best Web Hosting Provider In India 2024

తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో చిన్నారి డయానా శాంతికి న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి “స్పైనల్ మస్క్యులర్” వ్యాధితో బాధపడతూ ఆపాప తల్లిదండ్రులు జనవరి 3 న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ డా. కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.