Best Web Hosting Provider In India 2024
అమరావతి: ‘పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు.. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం అత్యంత ఆకర్షణీయం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు రాబోతుంటే.. అందులో మూడు మన రాష్ట్రంలోనే వస్తున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే’ అని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ నేపథ్యంలో కొందరు జాతీయ మీడియా ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు.