Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆహ్వానం మేరకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దగ్గిజ పారిశ్రామిక వేత్తలు విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో పాల్గొననున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశామన్నారు. 3వ తేదీ (రేపు) ఉదయం 9 గంటల నుంచే పారిశ్రామికవేత్తల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 10 గంటలకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.