Best Web Hosting Provider In India 2024

విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వేదిక నుంచి రాష్ట్రంలో నెలకొల్పిన నూతన పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. శ్రీసిటీ, అచ్యుతాపురం ఎస్ఈజెడ్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన పారిశ్రామిక యూనిట్లను కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, సర్బానందతో కలిసి సీఎం వైయస్ జగన్ వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం రూ. 3,845 కోట్లతో నిర్మించిన పరిశ్రమలను సీఎం వైయస్ జగన్ జీఐఎస్–2023 వేదిక నుంచి ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 9,100 మందికి ఉపాధి లభించనుంది.