సీతంరాజును గెలిపించి సీఎంకు గిఫ్ట్‌గా ఇద్దాం 

Best Web Hosting Provider In India 2024

విశాఖ‌ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను గెలిపించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి   సీతంరాజు సుధాకర్ కి మార్చి 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు 1ని వేసి అతని గెలుపుకు  కృషిచేయాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి టెలీ కాలింగ్ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనను నమ్ముకున్నవారికి అన్యాయం చేయరని కోలా గురువుల ద్వారా నిరూపణ అయిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న కోలా గురువులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ తరఫున ప్రచారం చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు తరలివచ్చారన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *