Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం.. ఈ రెండు ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించామని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని, ప్రభుత్వం మీద, వైయస్ జగన్ నాయకత్వం మీద పారిశ్రామిక వేత్తలు పూర్తి విశ్వాసాన్ని చూపించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం వైయస్ జగన్ బ్రాండ్ కనిపించిందన్నారు. రెండు రోజుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 ఎంవోయూల చేసుకున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల పైచిలుకు మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు, యువతకు ఉపాధి కోసం, రాష్ట ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసేందుకు జీఐఎస్ దోహదపడుతుందన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.