Best Web Hosting Provider In India 2024

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. శనివారం సాయంత్రం సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీహెచ్ శ్రీధర్ మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్గా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సీహెచ్ శ్రీధర్ ను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగించారు.
- ఎం.వి. శేషగిరి బాబు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.
- జి. రేఖా రాణి హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
- పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చెవ్వూరు హరి కిరణ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలో ఉంటారు.
- జి. వీరపాండ్యన్ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు.
టాపిక్
Andhra Pradesh NewsIas OfficersAp GovtTrending ApTelugu NewsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.