Best Web Hosting Provider In India 2024
KCR Comments On Budget : బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పద్దులో దళితబంధు ప్రస్తావన లేకపోవటం విచారకమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్లు బడ్జెట్ ఉందని విమర్శించారు. మత్స్యకారులకు భరోసా లేదని… రైతుబంధు ఎప్పుడు వేస్తారనే ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు.
భట్టి అన్ని వట్టి మాటలే చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానంలో అసెంబ్లీ వేదికగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఒక్క పాలసీ కూడా స్పష్టంగా లేదన్న కేసీఆర్… రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా ఓ కథలా ఉందంటూ ఆక్షేపించారు.
బడ్జెట్ లో ఏం లేదు – కేసీఆర్
“ ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు అర్థమవుతోంది.. దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు ప్రస్తావన లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు నిరాశే.. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని తయారు చేయలేదు. రైతు భరోసా ప్రస్తావనే లేదు. ఇది రైతుల బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు.. ఇది ఎవరి బడ్జెట్ కాదు. బడ్జెట్లో గ్యాస్, ట్రాష్ తప్ప ఏం లేదు. బడ్జెట్ ప్రసంగంలా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
టాపిక్