Best Web Hosting Provider In India 2024

AP TET 2024 Update : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు జులై 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.
సంబంధిత కథనం
టాపిక్
Ap TetAp Dsc 2024Ap JobsAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.