Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 10 గేట్లు ఎత్తివేత

Best Web Hosting Provider In India 2024


Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,79,822 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో , 3,32,447 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులకు చేరుకుంది.

కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి

శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 209.6 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు. దీంతో 10 క్రెస్ట్ గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల ఎత్తుకు ఎత్తి స్పిల్‌వే ద్వారా దాదాపు 2.76 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 57కే క్యూసెక్కుల నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తికి విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్‍లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. దీంతో మొత్తం 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఆగస్టు 1న శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

SrisailamSrisailam DamFloodsKrishna RiverAndhra Pradesh NewsKurnool
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024