Yamini Krishnamurthy : ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

Best Web Hosting Provider In India 2024

Yamini Krishnamurthy : ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వయస్సురీత్యా అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచారు.

 

యామినీ కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎంతో పేరు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకుని, పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. యామినీ కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబరు 20న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. అనంతరం వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం పొందిన యామినీ.. 1957లో తన తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతలు పొందారు. భారతప్రభుత్వం యామినీ కృష్ణమూర్తికి పద్మ శ్రీ(1968), పద్మ భూషణ్(2001), పద్మ విభూషణ్(2016) అవార్డులతో సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించారు.

WhatsApp channel
 

టాపిక్

 
Andhra Pradesh NewsChittoorTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024