OTT Thriller Series: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కాందహార్ హైజాక్ ఘటన ఆధారంగా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

1999లో పాకిస్థాన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ వస్తోంది. ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‍లో విజయ్ వర్మ, నజీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ టీజర్‌ను నేడు (జూలై 3) నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చింది. అలాగే స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది. ఈ టీజర్ ఎలా ఉందంటే..

 

టీజర్ ఇలా..

నేపాల్ రాజధాని ఖట్మాండు నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరే ఇండియన్ ఎయిర్‌లైన్స్ ‘ఐసీ 814’ విమానంలో వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవడంతో ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ టీజర్ మొదలైంది. అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్‍ శరణ్ దేవ్‍గా నటించిన విజయ్ వర్మ సూచిస్తారు. అప్పుడు ప్రయాణికులందరూ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత ముసుగు వేసుకున్న ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రయాణికులకు తుపాకులు గురిపెడతారు. ఎయిర్ హోస్టెస్‍పై దాడి చేస్తారు. ఆ తర్వాత విమానం హైజాక్ అయినట్టు అందరికీ అర్థమవుతుంది.

ఈ హైజాక్‍తో దేశమంతా ఉలిక్కిపడినట్టు టీజర్లో ఉంది. భారత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు హైజాక్ తర్వాత ఢిల్లీలో చర్యలకు ఉపక్రమిస్తారు. అప్పట్లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్‌కు విమానాన్ని తరలించేలా చర్యలు తీసుకుంటారు. ఇలా గ్రిప్పింగ్‍గా ఈ టీజర్ ఉంది.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍లో అధికారులుగా నజీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, దియా మీర్జా, మనోజ్ పహ్వా కనిపించారు. అరవింద స్వామి కూడా ఓ పాత్ర చేశారు.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ముల్క్, తప్పడ్, అర్టికల్ 17, భీడ్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ఆయన ఈ సిరీస్‍తో ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నారు. మ్యాచ్ బాక్స్ షాట్స్, బెనారస్ మీడియా వర్క్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఆగస్టు 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. టీజర్ హిందీలోనే వచ్చింది. అయితే, ఈ సిరీస్ ఇతర కొన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. ఐదుగురు హైజాకర్లు, 188 జీవితాలు, 7 రోజుల భయానకం అంటూ ఈ టీజర్‌ను పోస్ట్ చేసింది నెట్‍ఫ్లిక్స్. యథార్థ ఘటనలతో ఈ సిరీస్ రూపొందించినట్టు పేర్కొంది.

హైజాక్ వివరాలు

నేపాల్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఐసీ 814 విమానాన్ని 1999 డిసెంబర్ 24వ తేదీన పాకిస్థాన్‍కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిద్దీన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు విమానాన్ని తీసుకెళ్లాలని పైలట్లను బెదిరించారు. చివరగా కాందహార్‌కు ఈ విమానాన్ని తీసుకెళ్లారు. ఏడు రోజుల పాటు ప్రయాణికులను అదే విమానంలో బంధించారు. ముగ్గురు టెర్రరిస్టులను విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించటంతో విమానాన్ని చివరికి వదిలేశారు. దీంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనపై ఇప్పుడు ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ వస్తోంది. ఆగస్టు 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024