AP IIIT Counselling : ట్రిపుల్ ఐటీ రెండో విడత ఎంపిక జాబితా విడుద‌ల, కాల్ లెట‌ర్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024


AP IIIT Counselling : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌ల్లో ప్రవేశాల‌కు సంబంధించిన రెండో ద‌శ ఎంపిక జాబితా విడుద‌ల అయింది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివ‌ర్సిటీ (ఆర్‌జీయూకేటీ) ప‌రిధిలోని నాలుగు క్యాంప‌స్‌ల్లో చేరేందుకు అభ్యర్థుల‌ను ఎంపిక చేశారు.

ట్రిపుల్ ఐటీ శ్రీ‌కాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపుల‌పాయ క్యాంప‌స్‌ల్లో ఒక్కో క్యాంప‌స్‌లో 1,000 సీట్లు చొప్పున నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. అలాగే ఈడ‌బ్ల్యూఎస్ కోటా ప‌ది శాతం సీట్లు ఒక్కో క్యాంప‌స్‌కు 100 సీట్లు చొప్పున 400 సీట్లకు క‌లిపితే, మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో మొత్తం 4,140 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 3,396 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన 1,004 సీట్లను రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. రెండో ద‌శలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్‌జీయూకేటీ సెట్ అడ్మిష‌న్ క‌న్వీన‌ర్ ఎస్‌.అమ‌రేంద్ర కుమార్ విడుద‌ల చేశారు. అలాగే క్యాంప‌స్‌ల మార్పు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివ‌రాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. ఫేజ్‌-2 కౌన్సెలింగ్ కు హాజ‌రయ్యే అభ్యర్థులు కాల్ లెట‌ర్‌ను యూనివ‌ర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

రెండో ద‌శ కౌన్సెలింగ్‌కు సంబంధించి జులై 30 వరకు రిజిస్ట్రేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించారు. అలాగే మొద‌టి ద‌శ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంప‌స్ మార్పులు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు కూడా జులై 30 వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను శ‌నివారం విడుద‌ల చేశారు. కాల్ లెట‌ర్‌ను యూనివ‌ర్సిటీ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://admissions24.rgukt.in/ind/Phase2CLs నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే క్యాంప‌స్‌లు మార్పు చేసుకున్నవారు అధికారిక లింక్‌ https://admissions24.rgukt.in/ind/CampusChange ఇందులో చెక్‌చేసుకోవ‌చ్చు. అలాగే యూనివ‌ర్సిటీ అధికారిక లింక్‌ https://admissions24.rgukt.in/ లో ఇత‌ర వివ‌రాలు చూడొచ్చు.

రిజ‌ర్వేష‌న్ల అమ‌లు ఇలా

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల‌కు రిజ‌ర్వేష‌న్లను ఇలా అమ‌లు చేస్తారు. ఎస్‌సీల‌కు 15 శాతం, ఎస్‌టీల‌కు 6 శాతం, బీసీల‌కు 29 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తారు. బీసీల్లో 29 శాతంలో కూడా బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశారు. విక‌లాంగుల‌కు 5 శాతం, సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థుల‌కు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భార‌త్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్ల‌ను కేటాయిస్తారు. అలాగే ప్రతి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్ల‌ను బాలిక‌ల‌కు కేటాయిస్తారు.

కోర్సులు

పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ క‌లిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్య‌సించ‌వ‌చ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సుల‌తో స‌మానంగా మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్ సైన్స్ ప్ర‌త్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, సివిల్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ బ్రాంచ్‌లు ఉంటాయి.

ఫీజులు

ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థుల‌కు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూష‌న్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు ఉంటుంది. బీటెక్ విద్యకు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.50 వేలు ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల అభ్యర్థుల‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.1.50 ల‌క్షలు ఉంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsEducationRgukt IiitTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024