TS DOST 2024 Updates : డిగ్రీ ప్రవేశాలు – ‘దోస్త్‌’ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే…

Best Web Hosting Provider In India 2024

TS DOST 2024 Special Phase Registrations : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు కూాడా ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

 

‘దోస్త్’ ప్రత్యేక విడతకు రిజిస్ట్రేషన్‌ గడువును ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించారు. వెబ్‌ ఆప్షన్లను కూడా 5వ తేదీ వరకు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 7వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. ఈ స్పెషల్ ఫేజ్ లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు…. ఆగస్టు 9వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. https://dost.cgg.gov.in/welcome.do లింక్ తో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

TS DOST Registration 2024 – ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి….

  • డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
  • ఇందులో Candidate Pre-Registrationపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ముందుగా Application Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.
  • Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • వివరాల పరిశీలన తర్వాత సీటును కేటాయిస్తారు.

మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మూడు విడతలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని మిగిలిన విద్యార్థులు సీట్లు పొందవచ్చు.

 

దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు దశలు పూర్తి కాగా… మిగిలిన సీట్లను స్పెషల్ ఫేజ్ లో భర్తీ చేయనున్నారు.

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

లాసెట్ కౌన్సెలింగ్ – ముఖ్య తేదీలు

ఆగస్టు 5వ తేదీ నుంచి తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ల కోసం రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 28 నుంచి 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.

 

ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

 

WhatsApp channel
 

టాపిక్

 
EducationAdmissionsTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024