Manu Bhaker History: మరో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరో బ్రాంజ్ మెడల్

Best Web Hosting Provider In India 2024


Manu Bhaker History: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు రెండో మెడల్ వచ్చింది. ఈ మెడల్ కూడా షూటర్ మను బాకరే తీసుకురావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మను బాకర్, సరబ్‌జ్యోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ గెలిచింది. కొరియాతో జరిగిన ఈ మెడల్ ఈవెంట్లో ఇండియన్ టీమ్ 16-10తో విజయం సాధించింది.

మను బాకర్ మరో చరిత్ర

షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లోనూ మను బాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లోనూ ఆమె మెడల్ గెలిచింది. ఇలా ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా మను బాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కొరియాతో మంగళవారం (జులై 30) జరిగిన బ్రాంజ్ మెడల్ ఈవెంట్లో ఇండియా 13 షాట్ల తర్వాత 16-10తో విజయం సాధించింది.

 

అంతకుముందు మను బాకర్ వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ మెడల్ గెలిచింది. అప్పుడు కూడా షూటింగ్ లో మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్ గా నిలవగా.. ఇప్పుడు ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఒలింపిక్స్ లో ఇండియాకు రెండు మెడల్స్ రాగా.. రెండూ మను బాకర్ వల్లే రావడం విశేషం. ఇక మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో ఆమె పార్ట్‌నర్ సరబ్‌జ్యోత్ కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్.

 

మను బాకర్ ఈ ఒలింపిక్స్ లో మరో ఈవెంట్లోనూ పాల్గొననుంది. మరి అందులోనూ మెడల్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి. నిజానికి గత టోక్యో ఒలింపిక్స్ లోనూ ఆమె మూడు ఈవెంట్లలో పాల్గొన్నా ఒక్క మెడల్ కూడా సాధించకుండా నిరాశ పరిచింది. కానీ ఈసారి మాత్రం తనపై ఉన్న భారీ అంచనాలు, ఒత్తిడిని తట్టుకుంటూ 22 ఏళ్ల మను బాకర్ వరుసగా రెండో మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేసింది.

 

ఈ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సెర్బియా గోల్డ్ మెడల్, తుర్కియే సిల్వర్ మెడల్ గెలిచాయి.

 

మూడో ఇండియన్ అథ్లెట్

మను బాకర్ కంటే ముందు ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. అయితే ఆ ఇద్దరూ వేర్వేరు ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించారు. వాళ్లలో ఒకరు రెజ్లర్ సుశీల్ కుమార్ కాగా.. మరొకరు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. 2008, 2012లలో వరుసగా బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ గెలిచాడు సుశీల్ కుమార్.

 

ఇక పీవీ సింధు అయితే 2016, 2020లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. తాజాగా మను బాకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source link