విలువలు, విశ్వసనీయత వైయ‌స్ఆర్‌సీపీ నైజం

Best Web Hosting Provider In India 2024

పాడేరు నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్  

ఉమ్మడి విశాఖ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక

అక్కడ వైయస్ఆర్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది.

600కు పైగా స్ధానాల్లో మన పార్టీ గెలిచింది

టీడీపీ కేవలం 200పైగా స్థానాల్లోనే విజయం : గుర్తు చేసిన వైయస్‌ జగన్‌.

నైతికత ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దు

అయినా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని నిలిపారు

అలా ఆయన ఒక అధర్మ యుద్ధానికి తెర తీశారు

వైయస్ఆర్‌సీపీ ప్రతినిధులకు ప్రలోభాలు

అలా వారిని లొంగదీసుకోవాలన్న యత్నం : వైయస్‌ జగన్‌ వెల్లడి.

గత ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో హామీలు

ఓ 10 శాతం మంది ప్రజలు ఆకర్షితులయ్యారు

ఇప్పుడు చంద్రబాబు యథావిథిగా వైఖరి చూపారు

సూపర్‌ సిక్స్‌ సహా హామీలన్నింటినీ గాలికొదిలారు

పాడేరు నియోజకవర్గం స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో వైయస్‌ జగన్ 

తాడేపల్లి: విలువలు, విశ్వసనీయత వైయ‌స్ఆర్‌సీపీ నైజమ‌ని పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ ప్రజా ప్రతినిధులందరిదీ అదే బాట అని స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన‌ట్ల  వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పాడేరు నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో వైయ‌స్ జ‌గ‌న్ సమావేశమ‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

నైతికత ఉంటే..:
    పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. పాడేరు నియోజకవర్గంలో దాదాపుగా 85 స్ధానాల్లో ఎన్నికలు జరిగితే మనం 57 స్ధానాల్లో గెలిచాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువులు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే.. టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెల్చారు. వారికి, మనకు దాదాపుగా 387 స్ధానాల తేడా ఉంది.  

అదే మనం అయితే..:
    గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. మీ జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఉంటే.. వాళ్లకు అక్కడ  మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు.. ప్రజలు ఆ పార్టీ గుర్తును చూసి వారికి ఓట్లేసి గెలిపిస్తే.. మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం. మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని.. పోలీసులు, అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏ మాత్రం ధర్మం కాదు.

చంద్రబాబు నైజం:
    కానీ, ఇక్కడ చంద్రబాబునాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభపెడుతున్నారు. మనుషులను పంపించిన మరీ మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నారు.

అప్పుడే ఎవరైనా ఎదుగుతారు:
    అంటే ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో రాజకీయాల్లో విలువలును అట్టడుగు స్ధానంలోకి తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతోంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను, విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలుపెడతామే ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవుడెరుగు.. ఇంటిలో కూడా గౌరవం ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.

అదే నా రాజకీయ జీవితం:
    నేను నా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాను. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరమే బయటకు వచ్చాం. 
    నేను నా జీవితంలో అలాంటి రాజకీయాలే చేశాను. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాను. నేను అమ్మ ఇద్దరమే కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే.. నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పాను. 
    అక్కడ నుంచి మొదలుపెడితే కేవలం ఇద్దరమే మొదలుపెట్టి దేవుని దయతో ప్రతి అడుగులో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశామని తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలం.

అవి చెప్పమన్నారు. కానీ నేను..:
    2014 ఎన్నికల్లో మనం ఓడిపోయాం. అప్పుడు కూడా మన వాళ్లు నా దగ్గరికి వచ్చి నా మంచి కోసం, మన మంచి కోసం చాలా చెప్పారు. చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చిన్లు అబద్దాలు ఆడుతున్నారు. రైతులు, మహిళలకు రుణమాఫీ అంటున్నారు. ఇంటింటికీ ఉద్యోగం. ఒకవేళ అది ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్ధలం అంటున్నారు. కాబట్టి, మనం కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పమన్నారు. ముందైతే చెప్పేయండి. ఆ తర్వాత సంగతి చూద్దామన్నారు. కానీ చేయలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్‌ ఇష్టపడడు. అబద్దం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. 

ఆ తర్వాత బాబుకు ఏం జరిగింది?:
    ఆ తర్వాత చంద్రబాబు పరిపాలన చేశాడు. ఆ ఎన్నిక్లలో అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేశాడు అన్నది అందరికీ తెలిసేటట్టుగా 2019 ఎన్నికలు వచ్చేసరికి డిపాజిట్లు దక్కని స్ధితిలోకి పోయాడు.

మేనిఫెస్టో నిర్వచనం మార్చాం:
    అప్పుడు మనం అధికారంలోకి వచ్చాం. మన మేనిఫెస్టోలో చెప్పినది ఏదీ కూడా తప్పకుండా.. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అంటే అర్ధం చెప్పేలా.. అడుగులు వేశాం. 
    గతంలో మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు. కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్‌ అని నిర్వచనం మారుస్తూ మాట తప్పకుండా అమలు చేశాం. 

మోసపు ప్రచారం:
    మొన్న ఎన్నికల్లో ఒ 10 శాతం ప్రజలు చంద్రబాబునాయుడు మాటలు నమ్మారు. చంద్రబాబు నాయుడు, ఆయన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి నీకు రూ.15వేలు, నీకు రూ.15 వేలు సంతోషమా? అని ప్రచారం చేశారు. అలాగే వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు సంతోషమా? అని అడుగుతూ ప్రచారం చేశారు. అదే ఇంట్లో వృద్దులు ఉంటే.. నీకు నెలకు రూ.4 వేలు పెన్షన్‌ సంతోషమా?. అని ప్రచారం చేశారు. ఈ మోసపు ప్రచారంతో ఓ పది శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారు. 

ఉన్నదీ పోయింది..:
    కానీ ఏమైంది?. చంద్రబాబు పాలన వచ్చిన రెండు నెలలు అయింది. స్కూళ్లు తెరిచారు, పిల్లలు బడులకు వెళ్తున్నారు. కనీసం జగన్‌ ఉండి ఉంటే అమ్మఒడి కింద అయినా రూ.15 వేలు ఇచ్చుండేవాడు. ఇప్పుడు ఆ రూ.15వేలు పోయే.. నీకు రూ.15వేలు, నీకు రూ.15 వేలు ఇస్తానని చెప్పిందీ పోయింది.
    వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్‌ ఉండి ఉంటే రైతుభరోసా కింద రూ.13,500 చేతిలో పడేవి. చంద్రబాబు వచ్చాడు. రూ.20 వేలు ఇస్తానన్నాడు. జగన్‌ ఇస్తానన్న రూ.13,500 పోయాయి, చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు రాకపోయే.

మీ జగన్‌ ఉండి ఉంటే..:
    అదే ఈరోజు మీ జగన్‌ ఉండి ఉంటే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి మూడునెలలకొకసారి ఫీజులు జమ అయ్యేవి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయాయి. జగన్‌ ఉండుండే మేలో ఆ డబ్బులు పడేవి. అదీ పోయింది. డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వారు కాలేజీలుకు వెళ్తున్నారు. ఫీజులు కట్టకపోతే టీసీలు తీసుకుని వెళ్లిపొమ్మని కాలేజీలు చెబుతున్నాయి. వసతి దీవెన పథకం కూడా పోయింది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఏప్రిల్‌లో పడాల్సిన సున్నావడ్డీ డబ్బులు కూడా రాలేదు.

అదే మన సర్టిఫికెట్‌:
    నేను ఒక్కటే విషయం చెపుతున్నాను. మోసం, అబద్దాలతో చేసిన పాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసిన పనులకు ఇవాళ తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలగుతున్నాం. చెప్పిన మాట వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో చేశామని తలెత్తుకుని వెళ్లగలుగుతున్నాం. అదీ మనకున్న సర్టిఫికేట్‌. 
    కానీ చంద్రబాబునాయుడుకి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రజల్లోకి వెళ్తే.. మీరిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ టెన్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సమాధానం చెప్పుకోలేని స్ధితిలో టీడీపీ కేడర్‌ ఉంది. అదే వాళ్లకూ మనకూ ఉన్న తేడా.

ప్రలోభాలకు లొంగవద్దు:
    మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేటట్టుగా, గొప్పగా ప్రజల్లో నిలబడేటట్టుగా నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు వరకు ప్రతి అడుగూ వేద్దాం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవ్వరూ లొంగవద్దు.

బాబును నమ్మితే..:
    ఒకే ఒకటి చెబుతున్నాను. జగన్‌ పలావ్‌ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబుని నమ్మి ఓటేశారు. పలావ్‌ పోయింది. బిర్యానీ పోయింది. చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైనా, నాయకులకైనా అంతే.

వారంతా జీరో అయ్యారు:
    గతంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్నాడు. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి టిక్కెట్టిచ్చాడు. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని.. కేవలం అడ్వాన్స్‌ ఇచ్చాడు. దాంతో అటువైపు పోయిన వాళ్లందరూ మరలా వెనక్కి వచ్చేస్తామని నాకు ఫోన్‌ చేశారు. కానీ ఒక్కసారి జారిపోయిన తర్వాత వెనక్కి వస్తే విలువలు, గౌరవం పోతుంది. వెనక్కి తీసుకోలేకపోయాం. వాళ్ల రాజకీయ జీవితం సున్నా అయిపోయింది. 

ఇది గుర్తు పెట్టుకొండి:
    రాజకీయాల్లో ఏ రోజైనా నిలబడాలి అంటే, ప్రజల మన్ననలు ఉంటాలంటే.. ఎప్పుడూ షార్ట్‌ కట్‌ దారి ఎంచుకోకూడదు. కష్టమైన కూడా విలువలు, విశ్వసనీయతతో కూడిన దారినే ఎంచుకోవాలి. మీ అందరి దగ్గర నుంచి కూడా నేను ఇదే ఉండాలని ఆశిస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ప్రజల్లోకి పోతే.. మాట చెప్పాం, నెరవేర్చాం అని కాలర్‌ ఎగరేసుకుని చెప్పాలి. మాలో అబద్దాలు, మోసాలు, కల్మషం ఉండవని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకొమ్మని కోరుతున్నాను. 

మన్యం నాకు తోడు:
    మన్యం ప్రాంతం ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. పార్టీ స్ధాపించినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడూ నాకు తోడుగా నిలబడింది. ఏ ప్రాంతం, ఎవరెటుపోయినా ఇక్కడ నాయకులు మాత్రం ఎప్పుడూ వంద శాతం నాకు తోడుగా ఉన్నారు. మీ ప్రేమలు, ఆప్యాయతలు ఇదే మాదిరిగా కొనసాగించమని కోరుతున్నాను. 
    కష్టాకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయం, సహకారం ఎక్కువ కావాలని కోరుతున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుంది. ఈ ఐదేళ్ల మన పోరాటంలో మీ సహాయ, సహకారాలు మెండుగా ఉండాలని కోరుతున్నాను.

ఏకాభిప్రాయంతోనే ఎంపిక:
    బొత్స సత్యనారాయణను మన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రంగంలోకి దింపుతున్నాం. మన ప్రాంత ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్ధులు అందరినీ పిలిచి అడిగాను.
ఎవరైతో బాగుంటుందో అడిగాను. అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. ఈ ఎన్నికలు శకుని పాచికలు మాదిరిగా జరుగుతున్న ఎన్నికలు. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి స్ట్రేచర్, ప్రొఫైల్‌ ఉండి ఓర్చుకోగలిగిన, నిలబడగలిగిన వ్యక్తి అయితే బాగుంటుందని అందరి నోటి నుంచి బొత్స సత్యనారాయణ పేరు వచ్చింది.  జిల్లా మొత్తం ఏకంగా కావాలంటే అటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని అందరూ చెప్పారు. 
    ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదీగాక, ప్రత్యేకంగా చంద్రబాబు లాంటి అన్యాయస్తుడితో యుద్ధం చేస్తున్నాం కాబట్టి.. గట్టిగా నిలబడగలిగిన నాయకుడిని నిలబెడితేనే మనకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. అలాగే బొత్సగారు కూడా మన వాళ్లకు గట్టి తోడుగా నిలబడగలగుతాడు.
    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలపై ఫోకస్‌ పెడుతున్నాం. మీ అందరూ బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని.. పేరుపేరునా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

Best Web Hosting Provider In India 2024