Puri Jagannadh: రాజమౌళి తండ్రి కథ అడిగితే నేను చెప్పలేదు.. విజయేంద్ర ప్రసాద్‌పై పూరి జగన్నాథ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Puri Jagannadh About Vijayendra Prasad: డ్యాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా అభిమానం అని రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్ చాలా ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు.

డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్

అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన పక్కా మాస్ కమర్షియల్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఆగస్ట్ 11న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్లాప్ మూవీ తీసిన వారానికి

“రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నాకు వచ్చిన ఓ ఫోన్ కాల్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. హిట్ సినిమా చేసినప్పుడు అంతా కాల్ చేస్తారు. కానీ, నేను ప్లాప్ సినిమా (లైగర్) తీసిన తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సారి ప్లాప్ మూవీ తీసిన వారానికి ఒకాయన నాకు కాల్ చేశారు” అని పూరి జగన్నాథ్ చెప్పారు.

ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్

ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన నాకు చేయరు. సడెన్‌గా ఈయన చేస్తున్నారేంటీ అని ఎత్తా. సర్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగారు. ఆయన కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్.. ఈయనకు నేనేం హెల్ప్ చేయన్రా బాబు అనుకున్నా. నెక్ట్స్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు” అని పూరి జగన్నాథ్ తెలిపారు.

ఫెయిల్ అవ్వండ చూడలేను

“అలా ఎందుకు అడిగారో నాకు అర్థమైంది. నేను వింటున్నా. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు. తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి ఉన్న ప్రేమ అభిమానంతో ఆ ఫోన్ కాల్ చేశారు” అని పూరి జగన్నాథ్ అన్నారు.

ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాక

“అయితే ఆ తర్వాత నేను ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకొని తీద్దాం అని, తీసి ఆయన్ని కలుద్దామని చెప్పలేదు (నవ్వుతూ). లవ్ యూ సర్. సో ఒళ్లు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్‌కి థాంక్స్. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా ఉన్నాడు” అని పూరి పేర్కొన్నారు.

విలన్‌గా సంజయ్ దత్

ఇదిలా ఉంటే, రామ్ పోతినేని, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నాడు. అలీ, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ, షయాజీ షీండే ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024