Best Web Hosting Provider In India 2024
మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం… పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి చూపించామన్నారు. మాట ఇచ్చామంటే తప్పే విధానం కాంగ్రెస్ లో లేదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని చెప్పిన హరీశ్ రావు మాట తప్పవద్దన్నారు. క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ. 31వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే…. కీలక హామీలను అమలు చేసి చూపించామన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. త్వరలోనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేస్తామని ప్రకటించారు.
“ఖమ్మం గడ్డ కాంగ్రెస్కు అడ్డా. మే 6, 2022న రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. 8 నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించాం. హరీశ్ రావు తన మాటపై నిలబడి రాజీనామా చేయాలి. సిద్ధిపేటలో ఉప ఎన్నిక వస్తే ఎలా గెలుస్తాడో చూస్తాం” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
టాపిక్