AP EAPCET 2024 Updates : ఏపీ ఎంసెట్ ప్రవేశాలు – ఆగస్టు 19 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, పూర్తి షెడ్యూల్ ఇదే

Best Web Hosting Provider In India 2024


ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీఈఏపీసెట్ 2024కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 19వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ వివరాలను వెల్లడించారు.

ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు ఆగస్టు 19 నుంచే చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 21 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి ఆగస్టు 22 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.

ఆగస్టు 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పునకు ఆగస్టు 23వ తేదీని నిర్దేశించామన్నారు. ఆగస్టు 26 వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు.

సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం ఆగస్టు 26 నుంచి ఆగస్టు 30 వరకు ఐదు రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని కన్వీనర్ వివరించారు. విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపిక సందర్భంలో ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అది సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Open PDF in New Window

టాపిక్

Ap EapcetAdmissionsAndhra Pradesh News

Source / Credits

Best Web Hosting Provider In India 2024