YS Jagan On CBN : ‘చంద్రబాబు గారు ఇకనైనా మేల్కోండి’… కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై జగన్ ఫైర్

Best Web Hosting Provider In India 2024


చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లోనే ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని దుయ్యబట్టారు.

అత్యంత దారుణం – వైఎస్ జగన్

“నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మేల్కోండి…

గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని జగన్ అన్నారు. విద్యార్థుల జీవితాలను అతాకుతలంచేసే ఘటన అని…. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని హితవు పలికారు. “విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి” అంటూ జగన్ ప్రకటన విడుదల చేశారు.

 

టాపిక్

Andhra Pradesh NewsAp PoliticsYs JaganChandrababu Naidu

Source / Credits

Best Web Hosting Provider In India 2024