Best Web Hosting Provider In India 2024
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, కుట్రలో అంతర్భాగమే వివేకా హత్య కేసు ఆరోపణలు అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ విచారణ జరుగుతుంటే హత్య కేసులో ముద్దాయి మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటీ..? గొడ్డలితో నరికానని ఒప్పుకున్న ముద్దాయి గంటల కొద్దీ టీవీ ఛానళ్లకు లైవ్ ఇస్తున్నాడంటే.. ఎలా చంపాను అని చెబుతున్నాడంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు.