Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరమయ్యాయి. రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించే ఇ–స్టాంపింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఆవిష్కరించారు.