Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ఎర్రగొండపాలెంలో దళితుల మీద దాడులు చేయించి.. దళితులే తనపై దాడులు చేశారంటూ చంద్రబాబు అండ్ కో ఎదురు దాడి చేస్తుందని, ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు రాయించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. దళిత నియోజకవర్గం మీద రాక్షసుడిలా చంద్రబాబు తన గ్యాంగ్ తో పడ్డాడని, దళితులంటే ఏరోజూ చంద్రబాబుకు పడదు. దళిత వ్యతిరేకిగా చంద్రబాబు ముద్ర వేసుకున్న అంశాలు కారంచేడు ఘటనల నుంచి కనిపిస్తాయన్నారు. బాబు వర్గం అంతా కారంచేడులో ఊచ కోత కోసిన విధానాన్ని దళితులు ఎప్పటికీ మరవరన్నారు. మనిషి రూపంలో ఉన్న సైతాన్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు చేసిన దాష్టీకాన్నిజూపూడి ప్రభాకర్రావు తీవ్రంగా ఖండించారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.