Best Web Hosting Provider In India 2024
అమరావతి: ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయస్ఆర్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమచేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించారు.