Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2023/04/vasantha.jpg)
ఎన్టీఆర్ జిల్లా : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తన అతని వెకిలితనానికి నిదర్శనమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. దేవినేని ఉమా కపట నాటక సూత్రధారి అని విమర్శించారు. జాతీయ నేతలను గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మన జాతి సంపద అని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం శక్తి నగర్ లో జాతీయ నేతల విగ్రహాలను కొందరు స్వల్పంగా ధ్వంసం చేసి, నష్టం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సోమవారం శక్తి నగర్లో వారి ఇరువురు విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.