NNS September 8th Episode: అంజ‌లి గురించి నిజం చెప్పిన అరుంధ‌తి – కూతురికి మాటిచ్చిన అమ‌ర్ – మ‌నోహ‌రి మోసం

Best Web Hosting Provider In India 2024


NNS September 8th Episode: పిక్నిక్​లో భాగంగా పిల్లలు అరుంధతి, మనోహరి పెరిగిన అనాథ ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆశ్రమం చూడగానే భాగీ ఎమోషనల్‌ గా ఫీలవుతుంది. అమర్‌ వచ్చి ఏంటి ఇక్కడే నిలబడిపోయావు అని అడగ్గానే మా అక్క కూడా ఇలాంటి ఆశ్రమంలోనే ఉండేది కదా అని మా నాన్న ప్రాణాలన్నీ మా అక్క మీదేనని బాధపడుతుంది. దీంతో సరేలే మిస్సమ్మ లోపలికి వెళ్దాం పద అని తీసుకెళ్తాడు అమ‌ర్‌. చెల్లి క‌న్నీళ్ల‌ను దూరం నుంచి చూస్తున్న ఆరుంధ‌తి కూడా కూడా బాధపడుతుంది.

ఇదే మా ప్ర‌పంచం…

ఇంతలో గుప్తా వస్తాడు. అరుంధ‌తిని వెళ్దాం పద అనగానే.. ఆగండి గుప్తా గారు చాలారోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడు ఈ ఆశ్రమం, ఈ గ్రౌండ్‌ ఇదే మా ప్రపంచం. నేను మనోహరి ఎంత ఆనందంగా ఉండేవాళ్లమో తెలుసా? ఆరోజులే బాగుండేవి గుప్తాగారు అంటూ పాత రోజుల్ని అరుంధ‌తి గుర్తుచేసుకుంటుంది.

భ‌గ‌వంతుడి అన్యాయం…

నీ తండ్రి గుండెలపై పెరగాల్సిన నువ్వు ఇట్ల‌ అయిపోవడానికి కారంణం నీ నాయనమ్మ భయం. నీ భ‌ర్త‌తో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా మ‌ర‌డానికి కారణం ఆ బాలిక స్వార్థం. నీకా భగవంతుడు అప్పుడు ఇప్పుడు అన్యాయం చేస్తూనే వచ్చాడు బాలిక అని గుప్తా మనసులో అనుకుంటాడు.

మ‌నోహ‌రి ఇరిటేష‌న్‌…

అందరూ ఆశ్రమంలో పిల్లలకి బట్టలు, పుస్తకాలు పంచుతూ ఆనందంగా ఉంటే మనోహరి ఇరిటేటింగ్‌ గా ఆశ్రమంలోకి వెళ్లి ఒక దగ్గర కూర్చుని చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఈ ఆశ్రమం మారలేదు, ఈ మనుషులు మారలేదు, నా బ్రతుకు మారలేదు. కొన్నాళ్ల క్రితం మొదలైన నా పగ తీరలేదు. అని అరుంధతి, అమర్ లకు పెళ్లి అయిన రోజులు గుర్తు చేసుకుంటుంది.

మ‌నోహ‌రితో ప్రేమ‌…

మరోవైపు రణవీర్‌ కూడా తాను ఫస్ట్‌ టైం మనోహరిని కలిసిన రోజులు గుర్తు చేసుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు. త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను లాయర్‌ తో పంచుకుంటాడు. మనోహరిని ప్రేమించింది. పెళ్లి చేసుకున్నది గుర్తు చేసుకుంటాడు. ఆశ్రమం లోపలికి వెళ్లిన అంజు ఒక దగ్గరకు వెళ్లి ఒంటరిగా కూర్చుంటుంది.

అయ్యో అంజు డ‌ల్​గా వెళ్లి కూర్చుంది వెళ్లి చూడండి అని అమ‌ర్‌తో అంటుంది భాగీ. అంజు ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏమైంది నాన్న‌ అని అడుగుతాడు అమర్​. నాకెందుకో ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది డాడ్‌. మరి వాళ్లకు మమ్మీ డాడ్‌ ఇద్దరూ లేరు కదా ఎలా ఉంటున్నారు డాడ్‌. నేను చాలా లక్కీ డాడ్‌. వాళ్ల లాగా అనాథను కాదు. నాకు మీరు నాన్నమ్మ, తాతయ్య రాథోడ్‌ అందరూ ఉన్నారు అని అంజు బాధపడుతుంటే దూరం నుంచి చూస్తున్న అరుంధ‌తి వెళ్లిపోతుంది.

ఎప్ప‌టికీ అనాథ‌వు కావు…

అమర్ కు ఏమైంది రాథోడ్‌…. అంజలి మాటలు వినగానే అలా అయిపోయారు అని అడుగుతుంది భాగీ. ఏం లేదు మిస్సమ్మ అరుంధతి అమ్మ గుర్తొచ్చి ఉంటారు అంటాడు రాథోడ్​. డాడీ ఉండగా నువ్వు ఎప్పటికీ అనాథవు కాదు. నేనున్నానుగా ఎప్పటికీ నీ చేయి పట్టుకునే ఉంటాను పద.. అని అమర్​ చెప్పగానే అంజు హ్యాపీగా ఫీలవుతుంది.

అరుంధ‌తి క‌న్నీళ్లు…

పక్కకు వెళ్లిన ఆరు, అంజు మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. గుప్తా వచ్చి ఓదారుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నీ మనసులో ఏదో సందేహం ఉంది అది చెప్పుకుని నీ మనసును తేలిక చేసుకో అని అడగ్గానే ఏం లేదని అరుంధ‌తి స‌మాధాన‌మిస్తుంది.

గుప్తా అరుంధ‌తి మ‌న‌సులోని నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. అంజు మీ కూతురు కాదన్న విషయం గుర్తుకు వచ్చిందా? అని అడగ్గానే ఆరు షాక్ అవుతుంది. అంజును ఎలా దత్తత తీసుకున్నది. తాను ఎవరి కూతురన్న రహస్యం గుప్తాకు చెప్తుంది ఆరు. మరోవైపు తన కూతురు దుర్గగురించి చెబుతూ ఏడుస్తుంటాడు రణవీర్‌. అంజు ఎవరి కూతురు? పుట్టిన బిడ్డను మనోహరి ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే నేటి( సెప్టెంబర్ 8) నిండు నూరేళ్ల సావాసం చూడాల్సిందే.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024