Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: పవన్ కల్యాణ్ చెత్తులెత్తేశాడు.. బట్టలు విప్పేశాడని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన శపథాన్ని నెరవేర్చడమే ధ్యేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాటి చెప్పుకున్నారని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలు, కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెడుతున్నారని చెప్పారు. పవన్ జనసేనను ప్రారంభించింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనన్నారు. మంత్రి తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.