బీసీలకు తీరని ద్రోహం చేసిన ఆర్‌.కృష్ణ‌య్య‌

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం

ఇలాంటి వ్యవహారాలతో వైయస్ఆర్‌సీపీని బలహీనపర్చలేరు

మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు

తాడేపల్లి: చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చార‌ని మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్‌.కృష్ణ‌య్య రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రులు స్పందించారు. ఈ మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
 
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.  
– ఎంతో గౌరవించి బీసీల అభ్యున్నతికి పాటుపడతారన్న ఆకాంక్షతో వైయ‌స్ జగన్ గారు కృష్ణయ్యకు పదవి ఇచ్చారు. 
– పార్టీలో ఎంతో మంది ఉన్నా.. కృష్ణయ్య ద్వారా దేశ రాజధానిలో, పార్లమెంటులో బీసీల వాణి వినిపిస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. 
– అలాంటి ఉదాత్త సంకల్పాన్ని నీరుగారుస్తూ.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చారు.

– చంద్రబాబు కొనుగోలు, కృష్ణయ్య రాజీనామా ఈ రెండు అంశాలను ప్రజలు గమనిస్తున్నారు. 
– తన పరిపాలన ద్వారా ప్రజలకు సమర్థ పాలన చంద్రబాబు అందించలేకపోతున్నారు. 
– ఆ అంశాలను మరుగున పరచడానికి ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు. 

– రాజీనామా చేసిన వారికి కొంత ఇచ్చి, ఆ ఖాళీ అయిన సీట్లను పదిరెట్లకు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు. 
– చంద్రబాబుకు ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది. రాజకీయాల్లో బాబు నయా మార్కెటింగ్ వ్యవహారమిది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 
– ఇలాంటి వాటికి కృష్ణయ్య తలొగ్గి రాజకీయంగా బీసీలకు తీరని ద్రోహం చేశారు. 
– ఇలాంటి వ్యవహారాలతో వైయస్ర్ఆర్‌సీపీని బలహీనపర్చలేరు. 
– అంతకుమించి రెట్టింపు స్పందనతో సమయం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. 

ఇట్లు, 
మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు

Best Web Hosting Provider In India 2024