Best Web Hosting Provider In India 2024

తూర్పు గోదావరి: స్పెషల్ ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకుంటాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఎవరి ఎజెండాను పవన్ అమలు పరచాలనుకుంటున్నాడు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్ళు చల్లాడన్నారు. పవన్ ను నమ్మిన వాళ్ళని దగా చేసాడని ధ్వజమెత్తారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరిగి వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టు ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడు. చంద్రబాబు ను బార్ గెయిన్ చేయడానికి పనికొస్తుంది పవన్ బలం పెరిగిందని చెప్పడం. పవన్ వాస్తవం ఒప్పుకుని తప్పుకుని చంద్రబాబు కు అప్పగిస్తున్నట్టు కనిపించిందన్నారు.
పవన్ చేసిన పనితో 2014-19 లో ప్రజలు నష్టపోయారని పవన్ ఆత్మసాక్షికి తెలియాలి. 2014-19 లో జరిగిన తప్పుల్లో పవన్ వాటాదారుడు. ప్రజలు, వైయస్ జగన్ పొత్తులను నమ్మలేదు… రైతుల దగ్గరకు వెళ్ళి కొంగజపం చేస్తున్నారు. ప్రకృతి వలన వచ్చిన కష్టాలను వికృతంగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడు.. ఏ లక్ష్యాలతో పవన్ కు జనసైనికులు మద్దతిచ్చారో అది చేయలేనని చెప్పేశాడన్నారు.