Best Web Hosting Provider In India 2024

రాజమండ్రి: పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల్లో 29 మంది ప్రాణాలను బలితీసుకున్న చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో మహానాడు ఏర్పాటు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం రోడ్లను డ్రిల్లింగ్ మెషిన్లతో తవ్వి కన్నాలు పెడుతున్నారని మండిపడ్డారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ పోరాటానికి గుర్తుగా ఏర్పాటు చేసిన దండి మార్చ్ వద్ద టీడీపీ జెండా కడతారా..? ఇంతకంటే దాష్టీకం ఉంటుందా..? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడారు.