Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చంద్రబాబు పాలనలో ఐదేళ్లు అప్పులు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మహానాడు పేరుతో అమాయకులను కూర్చోబెట్టి చంద్రబాబు సుత్తి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. అధికారం కోసం ఎలాంటి తప్పుడు మాటలైనా మాట్లాడే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్ని నాని అన్నారు. శనివారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.